Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శిరీషను బండబూతులు తిట్టినా పట్టించుకోలేదు.. రాజీవ్‌ను ''వాడు'' అంటే చంపేస్తానంది

ఆర్జీఏ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసు సంబంధించి రోజుకో కథ పుట్టుకొస్తుంది. శిరీష, నందు, నవీన్, శ్రవణ్‌లు మాట్లాడిన ఆడియో టేపులు లీక్ కావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గ

శిరీషను బండబూతులు తిట్టినా పట్టించుకోలేదు.. రాజీవ్‌ను ''వాడు'' అంటే చంపేస్తానంది
, బుధవారం, 21 జూన్ 2017 (13:18 IST)
ఆర్జీఏ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసు సంబంధించి రోజుకో కథ పుట్టుకొస్తుంది. శిరీష, నందు, నవీన్, శ్రవణ్‌లు మాట్లాడిన ఆడియో టేపులు లీక్ కావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్, ఫిల్మ్ నగర్‌లో ఆర్జే ఫోటో స్టూడియోలో శిరీష ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. 
 
అయితే, ఈ ఫోను సంభాషణలో రాజీవ్‌కు తనకు మధ్యలో ఎవరూ రాకుండా చూసుకోవాలని నందు, నవీన్‌లను కోరింది. ఈ ఫోన్ సంభాషణలో తేజస్వినిని బెదిరించాలని.. ఆ ఇద్దరు వ్యక్తులను కోరింది. ప్రధానంగా నందు అనే వ్యక్తితో జరిపిన సంభాషణలో రాజీవ్‌కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తేజస్వినిని వేధించాలని సూచించింది. మళ్లీ తేజస్విని రాజీవ్ జోలికి వెళ్లకుండా చూడాలని, ఈ సమస్యలో చిక్కుకోకుండా జాగ్రత్తగా డీల్ చేయాలని సలహా ఇచ్చింది. 
 
ఈనేపథ్యంలో శిరీషను నందు బండ బూతులు తిట్టాడు. అలాగే, రాజీవ్‌ను "వాడు" అని సంబోధించాడు. దీంతో శిరీష్... రాజీవ్‌ను 'వాడు' అనవద్దని నందును హెచ్చరించింది. రాజీవ్ అనాలని సూచించింది. రాజీవ్‌కు ఏదైనా అయితే చంపేస్తానని చెప్పింది. అతడు తన ప్రాణమని చెప్పుకొచ్చింది. రాజీవ్‌ను ఏమన్నా అంటే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఈ సంభాషణతో కూడిన లీకైన ఈ రెండో ఆడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిత్యానంద మహిళా భక్తుల పోలీసులపై థూ... అంటూ ఉమ్మేశారు... ఆ తర్వాత...?