అమ్మో! స్కూలు బస్సుల్లో పిల్లల్ని పంపాలంటేనే భయం భయం...
రాజమండ్రి: స్కూళ్ళకు పిల్లల్ని బస్సులో పంపాలంటేనే... తల్లితండ్రులు భయపడిపోయే పరిస్థితి ఇది. చూశారా ఈ ఘోరం... పిల్లల శరీరాల నుంచి ఇలా బస్సు రాడ్డు వెళ్ళిపోయి రక్తసిక్తం అయిపోయిన హృదయవిదారక దృశ్యం. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని సీతా
రాజమండ్రి: స్కూళ్ళకు పిల్లల్ని బస్సులో పంపాలంటేనే... తల్లితండ్రులు భయపడిపోయే పరిస్థితి ఇది. చూశారా ఈ ఘోరం... పిల్లల శరీరాల నుంచి ఇలా బస్సు రాడ్డు వెళ్ళిపోయి రక్తసిక్తం అయిపోయిన హృదయవిదారక దృశ్యం. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని సీతారామ పబ్లిక్ స్కూల్ బస్సు చెట్టుని ఢీకొట్టిన ప్రమాదంలో ఇలా ఇద్దరు విద్యార్థుల శరీరంలోకి ఇనుప చువ్వలు చొచ్చుకుపోయాయి. పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. వారికి జాగ్రత్తగా చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇంత నిర్లక్ష్యంగా యాక్సిడెంట్ చేసిన బస్సు డ్రైవర్కి తల్లిదండ్రులు శాపనార్థాలు పెడుతున్నారు.