Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆగస్టు 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె!

ఆగస్టు 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె!
, గురువారం, 31 జులై 2014 (19:18 IST)
ఆగస్టు 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టనున్నారు. గురువారం బస్ భవన్‌లో ఆర్టీసి యాజమాన్యం కార్మికులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆగస్టు2వ తేదీ నుంచి సమ్మెబాట పట్టనున్నట్లు ఈయు అధికారులు ప్రకటించారు. 
 
చర్చల సందర్భంగా సొసైటీ బకాయిలు చెల్లించలేమని యాజమాన్యం తేల్చిచెప్పింది. కాగా ఆర్టీసి యాజమాన్యం సొసైటీకి రూ. 250 కోట్లు బకాయి పడింది. సొసైటీ డబ్బును వాడుకోవడంపై కార్మికులు అధికారులను నిలదీశారు. చర్చల జరుగుతున్న సమయంలోనే ఆర్టీసి ఈయు నేతలు బయటకు వచ్చేశారు. ఆగస్టు 2 నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu