Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీ ఎమ్మెల్యేలు షాక్ తిన్న కాకుల్లా గగ్గోలు పెడుతున్నారు: రోజా

టీడీపీ ఎమ్మెల్యేలు షాక్ తిన్న కాకుల్లా గగ్గోలు పెడుతున్నారు: రోజా
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (10:58 IST)
ఓటుకు నోటు కేసుపై అసెంబ్లీలో వైకాపా తీర్మానం ఇస్తే టీడీపీ ఎమ్మెల్యేలు షాక్ తిన్న కాకుల్లా గగ్గోలు పెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఓటుకు నోటు కేసుపై అసెంబ్లీ తాము వాయిదా తీర్మానం ఇస్తే టీడీపీ ఉలిక్కిపడుతోందన్నారు. 
 
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ.. పట్టిసీమ ప్రాజెక్టులో దోచుకున్న డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి టీడీపీ యత్నించిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసు తెలంగాణకు చెందినదని అంటున్నారని... అలాంటప్పుడు కేసులో నిందితుడైన మత్తయ్యకు ఏపీ ప్రభుత్వం ఎందుకు ఆశ్రయం కల్పించిందని రోజా అడిగారు. 
 
ఓటుకు నోటు కేసు కోర్టులో ఉన్నందున దీనిపై చర్చకు అనుమతించనని స్పీకర్ చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. జగన్ కేసులపై టీడీపీ నేతలు రోజూ మాట్లాడుతున్నా స్పీకర్ మౌనంగా ఉండటం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. ఆడియోలో ఉన్న స్వరం చంద్రబాబుదా? కాదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu