Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజా మళ్లీ మొదలుపెట్టారు... తెలుగు దొంగల పార్టీ... మంత్రులు గంగిరెద్దులు, దద్దమ్మలు...

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అవినీతిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. పెదబాబు-చినబాబు బినామీ పేర్లతో అమరావతి రాజధాని భూములను స్వాహా చేస్తున్నార

రోజా మళ్లీ మొదలుపెట్టారు... తెలుగు దొంగల పార్టీ... మంత్రులు గంగిరెద్దులు, దద్దమ్మలు...
, మంగళవారం, 28 జూన్ 2016 (17:55 IST)
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అవినీతిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. పెదబాబు-చినబాబు బినామీ పేర్లతో అమరావతి రాజధాని భూములను స్వాహా చేస్తున్నారని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడుగారు నడుపుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాదనీ, తెలుగు దొంగల పార్టీ అని అన్నారు. తెలుగు ఆత్మగౌరవాన్ని సింగపూర్ దేశంలో తాకట్టు పెట్టేశారని ఆమె ఎద్దేవా చేశారు.
 
సింగపూర్ దేశానికి ఏపీ భూములను అప్పగించేందుకు స్కెచ్ వేశారనీ, అందుకు ఆయన అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ పద్ధతిని సుప్రీంకోర్టు వ్యతిరేకించిన సంగతి గుర్తుచేశారు. ఇంత దోపిడీ జరుగుతున్న చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారనీ, బాబు చెప్పినదానికల్లా గంగిరెద్దుల్లా తలలు ఆడిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సింగపూర్ కు భూములు కట్టబెట్టకుండా అడ్డుకునేందుకు అవసరమైతే తాము నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తామని ఆమె చెప్పారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హాస్పిటల్లో ఆడపిల్ల పుడితే నో బిల్... మందులు కూడా ఫ్రీ... ఆ డాక్టర్ దేవుడు...