Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను మైక్ పట్టుకుంటేనే వణుకు.. నమస్తే తెలంగాణ ఓ చెల్లని కాగితం!

నేను మైక్ పట్టుకుంటేనే వణుకు.. నమస్తే తెలంగాణ ఓ చెల్లని కాగితం!
, గురువారం, 26 ఫిబ్రవరి 2015 (19:16 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానస పుత్రిక నమస్తే తెలంగాణ పేపర్ ఓ చెల్లని కాగితం అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి గురువారం ధ్వజమెత్తారు. 
 
తాను మైక్ పట్టుకుంటే అధికార తెరాస నేతలు వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నమస్తే తెలంగాణలో అవాస్తవాలే ఎక్కువని ఆరోపించారు. సచివాలయాన్ని తరలించేందుకు సర్కారు యత్నిస్తే తాము అడ్డుకుంటామన్నారు.
 
మంత్రి ఈటెలకు తెలియకుండానే చెక్ పోస్టులు ఎత్తేశారని, అందుకు బాధ్యతగా ఈటెల రాజీనామా చేయాలని అన్నారు. అవినీతి భాగోతం బయటపెడతారనే జర్నలిస్టులపై కఠిన ఆంక్షలు విధించారని రేవంత్ మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu