Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతుల కోసం జోలె పట్టుకుని రోడ్డు మీదికెక్కింది?: రేవంత్ రెడ్డి

రైతుల కోసం జోలె పట్టుకుని రోడ్డు మీదికెక్కింది?: రేవంత్ రెడ్డి
, మంగళవారం, 6 అక్టోబరు 2015 (17:45 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత రైతుల కోసం జోలె పట్టుకుని రోడ్డు మీదికెక్కింది అంటే దాని అర్థం ఏమిటని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు తన కుమార్తెను చూసైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. 
 
గజ్వేల్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో ఎవరైనా ఆడ బిడ్డ ఇంటి బయటకు వచ్చి జోలె పడుతోందంటే, దాని అర్థం ఆమె తండ్రి చేతకాని వాడు, తాగుబోతు, తిరుగుబోతు, కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకోని వాడు అని అర్థమని అన్నారు.
 
కవిత రైతుల కోసం జోలె పట్టుకుని రోడ్డుపైకి వచ్చిందంటే కేసీఆర్ చేతగాని వాడనే అర్థమని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేసీఆర్ రైతులను ఆదుకోవాలని, తక్షణం రైతు రుణమాఫీ అమలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu