Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎర్రచందనం స్మగ్లరే సినీ నిర్మాత.. సహజీవనం చేస్తూ దర్జాగా విలాస జీవితం!

ఎర్రచందనం స్మగ్లరే సినీ నిర్మాత.. సహజీవనం చేస్తూ దర్జాగా విలాస జీవితం!
, బుధవారం, 22 ఏప్రియల్ 2015 (10:27 IST)
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలికి వస్తున్నాయి. ఎర్ర చందనం అక్రమ తరలింపుపై ఉక్కుపాదం మోపిన సీఐడీ పోలీసులకు దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు తెలియవస్తున్నాయి. టాలీవుడ్‌లో ''ప్రేమ ప్రయాణం'' పేరిట సినిమాను తీసిన నిర్మాత ఎర్రచందనం స్మగ్లర్ అని తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. ఆ స్మగ్లర్ పేరు మస్తాను వలి. అతనో ఎర్రచందనం స్మగ్లర్ అని పోలీసులు తేల్చారు. ఎర్రచందనం అక్రమ రవాణాతో పోగైన కోట్లాది డబ్బుతో మస్తాన్ వలి సినీ నిర్మాత అవతారమెత్తాడు. తాను తీసిన చిత్రంలో హీరోయిన్ గా నటించిన నీతూ అగర్వాల్ తో సహజీవనం సాగిస్తూ అతడు దర్జాగా విలాస జీవితం గడుపుతున్నాడు. 
 
ఈ క్రమంలో దాదాపు రూ.35లక్షల విలువ చేసే ఫ్లాటును హైదరాబాదులో కొనుగోలు చేయడమే కాకుండా.. దానిని నీతూకు గిఫ్ట్‌గా ఇచ్చాడట. తాను తీసిన సినిమా లాభాలనేమీ ఇవ్వకపోవడంతో ఇక లాభం లేదని మస్తాన్ వలి రూటు మార్చాడు. ఏకంగా రాజకీయాల్లోకి దిగాడు. వైసీపీలో చేరి కర్నూలు జిల్లా చాగలమర్రి ఎంపీపీగా ఎంపికయ్యాడు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతోనే అతడికి కష్టాలు మొదలయ్యాయి. 
 
ఇటీవలే ఎర్రచందనం దుంగలను తరలిస్తూ శిరివెళ్ల పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ అతడిని విచారించిన సందర్భంగా పోలీసులకు అతడు సినీ నిర్మాత అనే విషయం తేలింది. అయితే ఆ తర్వాత బెయిల్‌పై అతడు దర్జాగా బయటకు వచ్చేశాడు. అతడు విదేశాలకు పారిపోకుండా, అన్ని ఎయిర్ పోర్టులకు లుకౌట్ నోటీసులను పోలీసులు జారీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu