Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాన్నా.. డీఎస్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందే : కల్వకుంట్ల కవిత

నాన్నా.. డీఎస్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందే : కల్వకుంట్ల కవిత
, శుక్రవారం, 27 మే 2016 (09:03 IST)
నిజామాబాద్ ఎంపీ, తెరాస మహిళా నేత కల్వకుంట్ల కవిత తన పంతం నెగ్గించుకున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చక్రం తిప్పిన ఆమె.. తన జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ మాజీ నేత, ప్రస్తుత తెరాస ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)కు టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఈ సీటు కోసం చాలా మంది పోటీ పడినప్పటికీ.. కవిత ఒత్తిడికి తలొగ్గిన కేసీఆర్.. చివరకు డీఎస్‌ను పెద్దల సభకు పంపించేలా నిర్ణయం తీసుకున్నారు. 
 
డీఎస్‌కు కేంద్ర స్థాయిలో చాలా మంది నాయ‌కుల‌తో సంబంధాలు ఉన్నాయి. దీనకితోడు బ‌ల‌మైన బీసీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో డీఎస్‌కు రాజ్య‌స‌భ సీటు కోసం క‌విత చాలా ఒత్తిడి చేశారు. కుమార్తె మాట కాద‌న‌లేని కేసీఆర్ డీఎస్‌ను రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌చేశారు.
 
మ‌ధ్య‌లో రాజ్య‌స‌భ సీటు కోసం దామోద‌ర్‌రావు, సీఎల్‌.రాజం, కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇలా కొన్ని పేర్లు వినిపించినా ఫైన‌ల్‌గా ల‌క్ష్మీకాంత‌రావుతో పాటు డీఎస్ పేరు రాజ్య‌స‌భ‌కు ఖ‌రారైంది.  రాజ్య‌స‌భ‌కు ఎంపికైన సంద‌ర్భంగా డీఎస్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తనకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తానని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు... విజ‌య‌వాడ‌, విశాఖ‌లో 45 డిగ్రీల సెల్షియ‌స్...