Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖకు చేరుకున్న రాహుల్ గాంధీ : హుదూద్ బాధితులకు ఓదార్పు

విశాఖకు చేరుకున్న రాహుల్ గాంధీ : హుదూద్ బాధితులకు ఓదార్పు
, ఆదివారం, 19 అక్టోబరు 2014 (11:39 IST)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం విశాఖపట్టణంకు చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో రాహుల్‌కు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ కేవీపీ రామచంద్రరావులు స్వాగతం పలికారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు రాహుల్ విశాఖ విచ్చేశారు. 
 
రాహుల్ గాంధీ విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా, పార్లమెంట్ తలుపులు వేసి, లైవ్ టెలికాస్ట్ కట్ చేసి ముక్కలు చేసిన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. విభజన నిర్ణయం సమయంలో ఎన్నో రకాలైన ఆందోళనలు చేసినప్పటికీ.. ముఖం కూడా చూపించని ఈ కాంగ్రెస్ నేత.. ఇపుడు హుదూద్ బాధితులను పరామర్శించేందుకు ఏపీలో అడుగుపెట్టడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu