Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్రం ఇచ్చే నిధులతోనే చంద్రబాబు పాలన చేస్తున్నారు : పురంధేశ్వరి

కేంద్రం ఇచ్చే నిధులతోనే చంద్రబాబు పాలన చేస్తున్నారు : పురంధేశ్వరి
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2016 (10:35 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల వల్లే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం ఎన్నో రకాలుగా ఏపీ ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వం ఇప్పటికే ఎంతో సాయం చేసిందన్నారు. ఇకపై కూడా ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుందని అన్నారు. వచ్చే నెల 6న రాజమండ్రిలో జరిగే సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారని వెల్లడించిన ఆమె, విశాఖకు రైల్వే జోన్‌ను తీసుకువచ్చే అంశంలో ప్రతిపాదనలు ఉన్నాయని, మరోసారి కేంద్రానికి విన్నవిస్తామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu