Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలవరంకు ఇచ్చింది రూ.100 కోట్లు కాదు.. రూ.800 కోట్లు : పురంధేశ్వరి

పోలవరంకు ఇచ్చింది రూ.100 కోట్లు కాదు.. రూ.800 కోట్లు : పురంధేశ్వరి
, బుధవారం, 27 మే 2015 (12:10 IST)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారంటూ చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి ఖండించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... పోలవరానికి కేంద్రం ఇచ్చింది వంద కోట్ల రూపాయలుకాదని... రూ.800 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. 
 
అలాగే ఏపీ రాజధానికి కేంద్రం రూ.8 వేల కోట్ల ఇచ్చిందని ఆమె చెప్పారు. ఈ మేరకు కడపలో మీడియాతో మాట్లాడిన పురంధేశ్వరి, ఏపీ ప్రత్యేక హోదాకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా వెల్లడించారని ఆమె గుర్తు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu