Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖైదీలకు క్రికెట్ ఫీవర్.. జైళ్లలో వరల్డ్ కప్ వీక్షణ..! 150 టీవీలు ఏర్పాటు..!

ఖైదీలకు క్రికెట్ ఫీవర్.. జైళ్లలో వరల్డ్ కప్ వీక్షణ..! 150 టీవీలు ఏర్పాటు..!
, శుక్రవారం, 6 మార్చి 2015 (15:09 IST)
భారత క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. అందునా ప్రస్తుతం ప్రపంచకప్, ముఖ్యంగా శుక్రవారం భారత్, వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతుండడంతో క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలోని ఖైదీలకు కూడా ఈ మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు. 
 
ఈ రెండు జైళ్లలోని ఖైదీలకు చూపిస్తున్నట్టు జైళ్ల డీజీ వీకే సింగ్ తెలిపారు. ఇందుకోసం చర్లపల్లిలో 100 టీవీలను, చంచల్ గూడలో 50 టీవీలను ప్రదర్శన కోసం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చట్ట ప్రకారం దూరదర్శన్ లో ప్రసారమయ్యే మ్యాచ్ ను ఖైదీలు చూస్తారని సింగ్ తెలిపారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu