Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు తర్వాత నారా లోకేషే ముఖ్యమంత్రి : మంత్రి పత్తిపాటి

చంద్రబాబు తర్వాత నారా లోకేషే ముఖ్యమంత్రి : మంత్రి పత్తిపాటి
, బుధవారం, 17 సెప్టెంబరు 2014 (20:03 IST)
చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా నారా లోకేష్ పగ్గాలు చేపడుతారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మాట్లాడుతూ... 20 ఏళ్ల వరకు టీడీపీ అధికారంలో ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు తర్వాత ఆయన తనయుడు లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. సీఎం అయ్యే అర్హతలన్నీ లోకేష్‌కు ఉన్నాయని పుల్లారావు వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే.. రుణమాఫీ నిధుల సమీకరణ కోసమే ఫార్మర్ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు సహకరించకపోవడం వల్లే కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్‌ను సెక్యూరటైస్‌ చేసి రుణమాఫీకి నిధులను తీసుకువస్తామన్నారు. వచ్చే 10 ఏళ్లకు సెక్యూరటైస్‌ చేయడంలో తప్పులేదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu