Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రజాదర్బార్!

హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రజాదర్బార్!
, గురువారం, 23 అక్టోబరు 2014 (13:04 IST)
దీపావళి పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్ ప్రజా దర్భార్‌ నిర్వహించారు. నరసింహన్‌ దంపతులు ఇందులో పాల్గొన్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గంట పాటు దర్బార్‌ హాలులో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజాదర్బాల్‌ భాగంగా గవర్నర్‌ దంపతులు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దంపతులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
అంతకుముందు గవర్నర్ దంపతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు రాజభవన్‌కు రావాల్సిందిగా పౌరులను గవర్నర్ దంపతులు ఆహ్వానించారు. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రాజభవన్‌లోని దర్బార్ హాల్లో గవర్నర్ దంపతులు అందుబాటులో ఉంటారని రాజ్‌భవన్ అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుద చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu