Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు : పొన్నం ప్రభాకర్ ధ్వజం

తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు : పొన్నం ప్రభాకర్ ధ్వజం
, బుధవారం, 26 ఆగస్టు 2015 (19:31 IST)
తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ జాగీరు కాదని, ఆయన ఇష్టమొచ్చినట్టుగా పాలన చేయడానికి, నడుచుకోవడానికి అంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయన బుధవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎవరు అడ్డుపడ్డా ఇరిగేషన్ ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తానని కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. 
 
ఇలా చేయడానికి కేసీఆర్‌దేమైనా రాజరికమా..? లేక జమిందార్ పాలనా? అని పొన్నం నిలదీశారు. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని, ప్రాజెక్టులపై అఖిలపక్షంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం.. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి.. తెలంగాణ ఏమైనా కేసీఆర్ జాగీరు కాదన్నారు. 
 
ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ను నిందిస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ప్రాజెక్టులపై అప్పుడెందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌, మంత్రులు పిచ్చి తుగ్లక్‌లను తలపిస్తున్నారని విమర్శించారు. రైతులను కించపరిచేలా మాట్లాడుతున్న తెరాస సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu