Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరో బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదు: పొన్నాల

మరో బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదు: పొన్నాల
, శనివారం, 30 ఆగస్టు 2014 (15:02 IST)
రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు.
 
బషీర్‌బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ నేతలు పొన్నాల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ 14 ఏళ్ల క్రితం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిందని, కరెంటు చార్జీలను తగ్గించమని అడిగిన పాపానికి ప్రజలను పిట్టల్లా కాల్చిన చరిత్ర చంద్రబాబు సర్కారుదని అన్నారు. కేసీఆర్ సైతం చంద్రబాబు తరహా పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu