Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలీసు.. భార్యకు నిప్పుపెట్టి చంపేశాడు.

పోలీసు.. భార్యకు నిప్పుపెట్టి చంపేశాడు.
, మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (06:42 IST)
ప్రజల మాన,ధన, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసోడు తన భార్య పాలిట రాక్షసుడిగా మారాడు. కట్నం  కోసం వేధించాడు. కర్కోటకుడిగా మారి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వివరాలిలా ఉన్నాయి.
 
వరంగల్ జిల్లా మద్దూరు మండలం వంగపల్లికి చెందిన చెందిన అనిల్‌ కుమార్ హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి‌ నల్లగొండ జిల్లా రాజాపేట మండలం పాముకుంటకు చెందిన జంగ మల్లయ్య కుమార్తె సంపూర్ణతో ఐదు నెలల క్రితం వివాహమైంది. 
 
ఆమె ప్రస్తుతం‌ గర్భవతి.‌ పెళ్లి అయిన నాటి నుంచి అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. అనిల్ తన తల్లిదండ్రులు, సోదరి అనితతో కలసి ఆదివారం భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. శరీరంతో కాలిన గాయాలు ఎక్కవ కావడంతో ఆమె మరణించారు. 

Share this Story:

Follow Webdunia telugu