Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధాని ప్రాంతంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

రాజధాని ప్రాంతంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్
, గురువారం, 5 మార్చి 2015 (08:15 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రాజధాని ప్రాంత గ్రామాలలో పర్యటిస్తారు. అక్కడి రైతులతో సభలు ఏర్పాటు చేసి భూ సేకరణ విషయంలో నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తారు. 
 
మొదట తాడేపల్లి మండలం ఉండవల్లికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు. అక్కడ నుంచి నేరుగా మంగళగిరి మండలం ఎర్రబాలెంకు వస్తారు. అక్కడ కూడా రైతులతో మాట్లాడుతారు. అక్కడ నుంచి నేరుగా తుళ్లూరు వెళ్ళి రాజధాని అవసరాలు భూములు ఇవ్వడం వలన వచ్చే లాభాలపై చర్చించి వారికి నచ్చజెప్పే కార్యక్రమం చేస్తారు. వారి సమస్యలను విని తెలుసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu