Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప‌వ‌న్ వాస్త‌వాలే చెబుతున్నార‌ట‌... ప‌త్తిపాటి స‌న్నాయి నొక్కులు

ప‌వ‌న్ వాస్త‌వాలే చెబుతున్నార‌ట‌... ప‌త్తిపాటి స‌న్నాయి నొక్కులు
, సోమవారం, 6 జులై 2015 (20:54 IST)
రాష్ట్రంలో జ‌రుగుతున్న తాజా ప‌రిణామాల‌పై స్పందిస్తాన‌ని ప‌దే ప‌దే చెప్పిన జ‌న‌సేన నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చివ‌ర‌కు విభ‌జ‌న సంద‌ర్భంగా అన్యాయం జ‌రిగింద‌ని చెప్పారు. దీనికి ఆయ‌న చెప్పిన‌వ‌న్నీ నిజాలేన‌ని, అందులో ఎటువంటి అనుమానం లేద‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు స‌న్నాయి నొక్కులు నొక్కారు. 
 
విభజన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి అన్యాయం జరిగిందన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మంత్రి ప్రత్తిపాటి ఏకీభవించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ వాస్తవాలే మాట్లాడుతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని చెప్పారు. 
 
అదే సమయంలో ఏపీ సమస్యల పరిష్కారానికి పార్లమెంటరీ కమిటీ వేయాలన్న పవన్ సూచన సరైనదేని పేర్కొన్నారు. అయితే విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu