Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీకి అన్యాయం.. నరేంద్ర మోడీని కలిసి నిలదీస్తా : పవన్ కళ్యాణ్

ఏపీకి అన్యాయం.. నరేంద్ర మోడీని కలిసి నిలదీస్తా : పవన్ కళ్యాణ్
, ఆదివారం, 1 మార్చి 2015 (14:04 IST)
కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే, వార్షిక బడ్జెట్‌లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని జనసేన పార్టీ అధినే పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి నిలదీయనున్నట్టు ఆయన ప్రకటించారు. 
 
కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిన విషయం తెల్సిందే. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో.. ఆదివారం ఉదయం హైదరాబాదులో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వారిద్దరు రైల్వే, వార్షిక బడ్జెట్‌లలో ఏపీకి జరిగిన అన్యాయంపై సుదీర్ఘంగా చర్చించారు. 
 
అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం కేటాయింపులు లేకపోవడం తనను నిరాశకు గురి చేసిందన్నారు. దీనిపై త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని చెప్పిన పవన్, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చిస్తానని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu