ఎంపీలు అంతా ATM, బ్యాంకుల ముందు నిలబడండి... పవన్ కళ్యాణ్ ట్వీట్స్
నోట్ల రద్దుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిగా ఆలస్యంగా స్పందించారు. డబ్బు కోసం జనం ఏటీఎంలు, బ్యాంకులు ముందు నిలబడీ, నిలబడీ నానా ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలకు భరోసా ఇచ్చే పనులైనా చేయరా అంటూ నిలదీసారు. కర్నూలు జిల్లాలోని ఎస్పీఐ బ్యాంకులో క్య
నోట్ల రద్దుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిగా ఆలస్యంగా స్పందించారు. డబ్బు కోసం జనం ఏటీఎంలు, బ్యాంకులు ముందు నిలబడీ, నిలబడీ నానా ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలకు భరోసా ఇచ్చే పనులైనా చేయరా అంటూ నిలదీసారు. కర్నూలు జిల్లాలోని ఎస్పీఐ బ్యాంకులో క్యూలో నిలబడి బాలరాజు అనే వ్యక్తి మరణించాడనీ, అతడి ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
బాలరాజు మూడు రోజులుగా డబ్బు కోసం తిరిగినా దొరకలేదనీ, చివరికి ఇలా అకాలమరణం చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో చూడాలంటే ప్రతి ఎంపీ రోజూ బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూల్లో నిలబడాలని పిలుపునిచ్చారు. ఇలా ప్రజలకు సంఘీభావం తెలపాలని కోరారు.