Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్

బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్
, గురువారం, 24 జులై 2014 (20:31 IST)
రైలు ప్రమాదంలో గాయపడి యశోదా ఆసుపత్రితో చికిత్స పొందుతున్న చిన్నారులను సినీహీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం గాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా లాంటివి ప్రకటించి చేతులు దులుపుకోకుండా ఆ కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకోవాలన్నారు. 
 
మొన్న ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లో కాపాలా లేని రైల్వేక్రాసింగ్ వద్ద గేటు నిర్మాణానికి కేటాయింపులు చేయడం కూడా జరిగిందని వెంటనే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. పవన్ కళ్యాణ్.. పవన్ వెంట పలువురు తెలుగుదేశం ఎం.ఎల్.ఎ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu