జగన్ ఈ జన్మలో సీఎం కాలేరు: పల్లె రఘునాథ రెడ్డి జోస్యం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ జన్మలో సీఎం కాలేరని టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జోస్యం చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి కోసం పగటి కలలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ జన్మలో సీఎం కాలేరని టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జోస్యం చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి కోసం పగటి కలలు కంటున్నారు. ఎన్ని గడపలు తట్టినా.. ఎన్ని యాత్రలు చేసినా ఈ జన్మకు జగన్ సీఎం కాదు కదా.. ఎంపీ, ఎమ్మెల్యే కూడా కాలేదని రఘునాథ రెడ్డి తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికెళ్లినా.. త్వరలోనే తాము అధికారంలోకి వస్తామని, ప్రజల కష్టాలు తీరుతాయని చెప్తున్నారని.. అలాంటిది జరగనే జరగదని పల్లె చెప్పారు. రెండేళ్లలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గద్దె దిగడం ఖాయమని విశాఖ పర్యటన సందర్భంగా జగన్ చెప్పారు. ఆ వెంటనే తాను అధికారంలోకి వస్తానని కూడా చెప్పడం హాస్యాస్పదని పల్లె సెటైర్లు విసిరారు.
కోట్ల అవినీతి చేసి దేశానికి ద్రోహం చేసిన జగన్ లాంటి వ్యక్తి ఇంటింటికీ వస్తున్నానంటూ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్ ఇంటింటికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడో నిలదీయాలి. అసమర్థుడు, అవినీతిపరుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందనే ఉద్దేశంతోనే ప్రజలు జగన్ను తిరస్కరించారు. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఆస్తులను ఈడీ జప్తుచేసింది. మరోవైపు కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే దిక్కుతెలియక జగన్ అయోమయంలో ఉన్నారని పల్లె గుర్తు చేశారు.