Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒంగోలులో స్వైన్‌ ఫ్లూ : మహిళ మృతి.. కలకలం!

ఒంగోలులో స్వైన్‌ ఫ్లూ : మహిళ మృతి.. కలకలం!
, శనివారం, 31 జనవరి 2015 (11:44 IST)
ఒంగోలులో స్వైన్ ఫ్లూకు ఒక మహిళ మృతి చెందింది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. జిల్లా కేంద్రంలో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోకిల (75) అనే మహిళ శనివారం ఉదయం చనిపోయింది. 
 
ఈమె మృతితో ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. దీంతో, జిల్లాలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం స్వైన్ ఫ్లూ నివారణకు అవసరమైన చర్యలను చేపట్టినట్టు తెలిపింది.
 
కాగా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న విషయం తెల్సిందే. ఈ రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu