Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాకు ఎయిడ్స్ వచ్చింది... ఎంజాయ్ చేయాలనుకున్నా... ఓబులేసు

నాకు ఎయిడ్స్ వచ్చింది... ఎంజాయ్ చేయాలనుకున్నా... ఓబులేసు
, సోమవారం, 24 నవంబరు 2014 (20:47 IST)
కేబీఆర్ పార్కు వద్ద పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డి కిడ్నాప్‌కు ప్రయత్నించి పట్టుబడిన ఓబులేసు రిమాండ్ రిపోర్టులో అతడు ఇచ్చిన వాంగ్మూలం వెలికి వచ్చింది. ఈ రిపోర్టులోని వివరాలు ఇలా ఉన్నాయి. తనకు ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ వచ్చిందనీ, అందువల్ల అంతిమ జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు ఇలా అక్రమంగా డబ్బు సంపాదించేందుకు కిడ్నాప్ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపాడు.
 
గ్రేహౌండ్స్లో 12 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన తాను ఏకే 47ను దొంగిలించడానికి కారణం కూడా ఇదేనంటూ వెల్లడించాడు. 2014 ఫిబ్రవరి 19న ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడిని అపహరించాననీ, ఆ యువకుడి తల్లిదండ్రుల నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు చెప్పాడు. కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం ప్రతిరోజూ డబ్బున్న వాళ్లు కార్లలో రావడం చూసి వారి కార్లలోకి ప్రవేశించి యజమానిని బెదిరించి డబ్బులు గుంజాలని యత్నించేవాడినని చెప్పాడు. నిత్యానందరెడ్డి సీటు బెల్టు పెట్టుకుంటున్న సమయంలో ఆయన కారులో దూరి ఏకే 47తో బెదిరించానట్లు తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu