Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ తలకిందులుగా యాత్ర చేసినా ప్రజలు నమ్మరు: రావెల

జగన్ తలకిందులుగా యాత్ర చేసినా ప్రజలు నమ్మరు: రావెల
, శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (19:08 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకుంటే ప్రజలు ఛీకొడతారని మంత్రి రావెల కిషోర్ అన్నారు. జగన్ తలకిందులుగా యాత్ర చేసినా ప్రజల ఆయనను నమ్మరన్నారు. ఆయనది బూటకపు యాత్ర అన్నారు. తమ పార్టీ ఉనికి కోసమే జగన్‌ బస్సుయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకే పట్టిసీమ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందన్నారు. తమ పార్టీ యువనేత నారా లోకేష్ టీడీపీ కార్యకర్తల కోసమే యాత్ర చేపట్టారన్నారు
 
సీఎం నారా చంద్రబాబు నాయుడుపైన జగన్ కర్నూలు ధ్వజమెత్తారు. పెండింగు ప్రాజెక్టులను సందర్శిస్తున్న జగన్ శుక్రవారం నాడు బానుకచర్ల హెడ్ రెగ్యులరేటర్‌ను పరిశీలించిన సందర్భంగా.. పోతిరెడ్డిపాటు నుండి బానుకచర్లకు 44వేల క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా, 3 నుండి నాలుగు వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu