భర్తకు కాలు విరిగిందని ఓ నవ వధువు ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా వినుకొండలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
వినుకొండ మండలం బాలాజీ ఎస్టేట్స్లోని ఒక ఫ్లాట్లో నివాసముంటున్న గుగ్గిలం అలేఖ్య (24)కు చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రకాశం జిల్లా పుల్లల చెరువుకు చెందిన ఉప్పు సతీష్తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి మంచి రోజులు లేకపోవడంతో అలేఖ్య పుట్టింట్లోనే ఉంటోంది. చెన్నైలోని భర్త వద్దకు వెళ్లేందుకు ఇటీవల ఏర్పాట్లు చేసుకున్నారు.
అంతలోనే చెన్నైలో ఉంటున్న భర్త సతీష్ బాత్రూమ్లో జారిపడటంతో కాలు విరిగింది. విషయం తెలుసుకున్న అలేఖ్య రెండు రోజుల నుంచి బాధపడుతూ మానసికంగా కుంగిపోయింది. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక మంగళవారం అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.