Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విమానంలో గవర్నర్.. అయినా వెనక్కి.. అధికారుల నిర్లక్ష్యం..!

విమానంలో గవర్నర్.. అయినా వెనక్కి.. అధికారుల నిర్లక్ష్యం..!
, సోమవారం, 30 మార్చి 2015 (14:59 IST)
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించారు. శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది నిర్లక్ష్యం, వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. గవర్నర్ నరసింహన్ మూడురోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ బయల్దేరారు.
 
అయితే విమానం అరగంట ప్రయాణించిన అనంతరం ప్రయాణికుల లగేజ్ లోడ్ చేయలేదని గ్రహించారు. వెంటనే వెనక్కి రావాల్సిందిగా పైలట్కు సమాచారం అందటంతో మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.  
 
లగేజ్ లోడ్ అయిన అరగంట తర్వాత విమానం ఢిల్లీ బయల్దేరింది. అయితే గవర్నర్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా విచారణకు ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu