Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ మెట్రోరైల్‌లో మోడీ.. ఎంజాయ్ చేశానంటూ ట్వీట్స్...

ఢిల్లీ మెట్రోరైల్‌లో మోడీ.. ఎంజాయ్ చేశానంటూ ట్వీట్స్...
, శనివారం, 25 ఏప్రియల్ 2015 (13:53 IST)
ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాణం చేశారు. శనివారం ఉదయం ఆయన తన కాన్వాయ్ కార్లను, భద్రతా సిబ్బందిని పక్కనబెట్టి.. సాదాసీదాగా ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
 
ద్వారకాలో నేషనల్ ఇంటిలిజెన్సీ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక ఫంక్షన్కు ఆయన మెట్రోలో తరలి వెళ్లారు. మెట్రో రైలు ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశానంటూ ఆయన ట్వీట్స్ చేశారు. ఎప్పుడూ సోషల్ నెట్ వర్కింట్ సైట్లలో కామెంట్లు, పోస్టులతో అభిమానులు, కార్యకర్తలతో టచ్లో ఉండే ప్రధాని స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ట్టిట్టర్లో పోస్ట్ చేశారు. 
 
మైట్రో‌లో ప్రయాణం చేయాల్సిందిగా మెట్రో రైల్ మాజీ చీఫ్ ఇ.శ్రీధరన్ చాలాసార్లు కోరారనీ, ఆ అవకాశం ఇపుడు వచ్చిందంటూ ట్విట్ చేశారు.   
 
ధౌలాకౌన్ నుండి ద్వారకా వరకు ప్రయాణం చేసిన మోడీ... ఢిల్లీ మెట్రో మ్యాన్గా పేరుగాంచిన శ్రీధరన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఢిల్లీలో మోడీ రాకపోకల సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన  భద్రతా వర్గాలు తెలిపాయి. 

Share this Story:

Follow Webdunia telugu