పెట్టుబడిదారులను ఆహ్వానించడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్ళిన టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ సోమవారం శాన్ఫ్రాసిస్కోకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఎన్.ఆర్.ఐ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
పసుపు కండువాలు ధరించిన తెలుగు యువత లోకేశ్ నినాదాలతో హోరెత్తించారు. దాదాపు 150 కార్లతో కూడిన భారీ ర్యాలీ వెంట రాగా లోకేశ్ విమానాశ్రయం నుంచి బస చేసే ప్రాంతానికి తరలివెళ్లారు.
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం అమెరికా వెళ్లిన లోకేశ్, ఈ నెల 12 దాకా అక్కడ పర్యటించనున్నారు. స్మార్ట్ విలేజ్ పై ప్రచారం చేయనున్న లోకేశ్, ఈ నెల 7న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్నారు.