Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓటుకు నోటుపై నోటీసులిస్తే మా నెత్తిపై పాలు పోసినట్లే... లోకేష్ వ్యాఖ్య

ఓటుకు నోటుపై నోటీసులిస్తే మా నెత్తిపై పాలు పోసినట్లే... లోకేష్ వ్యాఖ్య
, మంగళవారం, 30 జూన్ 2015 (21:14 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వ్యాఖ్య... తెగే వరకు లాగద్దనే కామెంట్ టి.సర్కారునుద్దేశించి అన్నారు. 
 
ఫోన్ ట్యాపింగ్ భయంతో టి.సర్కార్ వణుకుతోందని అన్నారు. ఆ భయమే లేకపోతే తెలంగాణ సర్కారు హోంశాఖ కార్యదర్శిని ఎందుకు మార్చారు...? ఇంటెలిజన్స్ చీఫ్ దీర్ఘకాలిక సెలవుపై ఎందుకు వెళ్లారు...? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తమకు టి. సర్కారు నోటీసులిస్తే తమ నెత్తిన పాలు పోసినట్టేనని వ్యాఖ్యానించారు. వారు నోటీసులు ఎప్పుడిస్తారా అని కోరుకుంటున్నట్లు చెప్పారు. 
 
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెడకు చుట్టుకుంటుందని కేసీఆర్ భయపడుతున్నారనీ, అందువల్లనే చంద్రబాబుకు ఎదురుపడలేకనే గవర్నర్ విందుకు గైర్హాజరయ్యారని అన్నారు లోకేష్. మొత్తమ్మీద ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ ఎప్పుడు పడుతుందో కానీ మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నాయి రెండు పార్టీలు.

Share this Story:

Follow Webdunia telugu