Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తుమ్మలపై నామా కామెంట్: బాబు వచ్చాక జాబులు గోవిందా!

తుమ్మలపై నామా కామెంట్: బాబు వచ్చాక జాబులు గోవిందా!
, బుధవారం, 27 ఆగస్టు 2014 (15:43 IST)
టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు పార్టీ మారుతున్నట్లుగా ఫ్లెక్సీలు ఏర్పాటైన నేపథ్యంలో ఖమ్మం జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు బుధవారం స్పందించారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ బలంగా ఉందని చెప్పారు.
 
జిల్లాలో టీడీపీ పెట్టినప్పటి నుండి పార్టీ బలంగా ఉందని, సాధారణ ఎన్నికలు మినహా అన్ని ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందన్నారు. టీడీపీ ఖమ్మం నగర నాయకులు మాట్లాడుతూ.. తుమ్మలకు పార్టీ ఎన్నో ఇచ్చిందని, ప్రస్తుతం పార్టీని వీడి వెళ్లడం సరికాదన్నారు.
 
మరోవైపు కృష్ణా జిల్లాలోని నందిగామ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా బి బాబురావును పోటీలో నిలబెడుతున్నట్లు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బుధవారం చెప్పారు. ప్రజల తరఫున ప్రభుత్వం పైన పోరాటం చేసేందుకే తమ పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారని కానీ, బాబు వచ్చిన తర్వాత జాబులు పోయాయని ఎద్దేవా చేశారు.

Share this Story:

Follow Webdunia telugu