Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ద్రోహులు: నాగం జనార్ధన్ రెడ్డి ఫైర్

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ద్రోహులు: నాగం జనార్ధన్ రెడ్డి ఫైర్
, బుధవారం, 17 డిశెంబరు 2014 (18:51 IST)
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ద్రోహులని భారతీయ జనతా పార్టీ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ద్రోహులని అభివర్ణించిన తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావుకు.. ఇప్పుడు వాళ్లు దోస్తులు ఎలా అయ్యారని ఆయన ప్రశ్నించారు. 
 
ఏనాడూ తెలంగాణ జెండా పట్టనివాళ్లు, జై తెలంగాణ అనని వాళ్లు బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారని నాగం జనార్ధన్ రెడ్డి నిలదీశారు. టిఆర్ఎస్‌లో మంత్రి పదవులు ఇవ్వడానికి సమర్థులైన ఎమ్మెల్యేలే లేరా అని ఆయన ప్రశ్నించారు. ఇతర పార్టీల వారిని చేర్చుకుని, మంత్రి పదవులు ఇవ్వడం తెలంగాణ ప్రజలను అవమాన పర్చడమేనని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu