Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ చూపంతా అవినీతిపైనే.. సంపాదనే బక్కన్న అజెండా: నాగం

కేసీఆర్ చూపంతా అవినీతిపైనే.. సంపాదనే బక్కన్న అజెండా: నాగం
, శనివారం, 25 అక్టోబరు 2014 (06:48 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు. టి. సీఎం చూపంతా అవినీతిపైనే ఉందని.. సంపాదనే అతని అజెండాగా మారింజని నాగం ఆరోపించారు. ప్రజల సమస్యలను కేసీఆర్ పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. రోజుకు ఒక గంట సమయాన్ని కూడా రైతుల కోసం ఆయన కేటాయించడం లేదని అన్నారు. కరెంట్ సమస్యను తీర్చకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
 
ఇదిలా ఉంటే... తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. సమావేశంలో పలు విషయాలపై కూలంకషంగా చర్చించి... కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.
 
ఇకపోతే.. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఎట్టి పరిస్థితుల్లో ఆపివేయమని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం... మాటకు కట్టుబడే ఉంది. సమస్య కృష్ణా రివర్ బోర్డు దృష్టికి వెళ్లినప్పటికీ... విద్యుత్ ఉత్పత్తిని మాత్రం కొనసాగిస్తూనే ఉంది. తెలంగాణ పరిధిలోకి వచ్చే లెఫ్ట్ పవర్ హౌస్‌లో ఉత్పత్తి కొనసాగుతోంది. 125 మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

Share this Story:

Follow Webdunia telugu