Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా సర్కార్ రైతు బంధు.. టీడీపీని దెబ్బతీసేందుకే విభజన!

మా సర్కార్ రైతు బంధు.. టీడీపీని దెబ్బతీసేందుకే విభజన!
, శనివారం, 26 జులై 2014 (15:03 IST)
వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చడమే తెలుగుదేశం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రైతుల మేలే పరమావధిగా తమ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉండటమే కాకుండా, వ్యవసాయాన్ని ఆధునీకరించి లాభసాటి ప్రక్రియగా మారుస్తానని, కరువుకాటకాలను సైతం తట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి రుణమాఫీ గొప్ప ఊరటనిస్తోందని, రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు.
 
కేవలం తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకే సమైక్య రాష్ట్రాన్ని ముక్కలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాంలోనే హైదరాబాదు అభివృద్ధి చెందిందని... ఈరోజు హైదరాబాదు నుంచి ఇంత ఆదాయం రావడానికి తామే కారణమని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతురుణాలను మాఫీ చేసి చూపించామని... మాటకు కట్టుబడ్డామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu