Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముగ్గురు కుమార్తెలతో సహా తల్లి ఆత్మాహుతి..!

ముగ్గురు కుమార్తెలతో సహా తల్లి ఆత్మాహుతి..!
, శనివారం, 28 మార్చి 2015 (12:55 IST)
రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన ఒక మహిళ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆత్మాహుతికి పాల్పడింది. తన ఇంట్లోనే కుమార్తెలతోపాటు తన మీద కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో అందరూ సజీవ దహనమయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే.. చిలుకూరు గ్రామానికి చెందిన అనిత (25) శుక్రవారం రాత్రి సమయంలో తన ముగ్గురు కుమార్తెలు అనిత మౌనిక (4), అక్షిత (3), జయలక్ష్మి (1) మీద కిరోసిన్ పోసి నిప్పంటించిన అనంతరం తాను కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. 
 
ఆమె భర్త గిరీష్ రాత్రి ఎనిమిదన్నర ప్రాంతంలో ఇంటికి వచ్చే సమయానికి తలుపు గడి వేసి వుంది. ఎంతకూ తలుపు తీయకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూస్తూ లోపల నలుగురి మృతదేహాలు కాలిపోయి కనిపించాయి. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu