Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్తికోసం కన్న కూతుర్ని చంపిన తల్లి... దారుణం!

ఆస్తికోసం కన్న కూతుర్ని చంపిన తల్లి... దారుణం!
, శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (18:46 IST)
హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లే కూతుర్చి నడి రోడ్డు కడతేర్చింది. స్థానికంగా నివాసం ఉండే కళ్యాణి(25)ను ఆమె కన్నతల్లి లక్ష్మి(50) కత్తితో నరికి చంపడమే కాక.. శవం పక్కనే కత్తి పట్టుకుని నిలబడింది.
 
దీంతో ఆమెను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మికి ముగ్గురు కుమార్తెలు. అంతా కలిసి లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నారు. తల్లీ కూతుళ్ల మధ్య కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి.
 
ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య చేశారని ఇరుగుపొరుగు వారు చెపుతున్నారు. ఈ హత్య చేయడానికి మిగతా ఇద్దరు కూతుళ్ళు కూడా తల్లికి సహకరించారని సమాచారం. లక్ష్మి తన కూతుర్ని హత్య చేయడానికి ముందు తన ఇంటి చుట్టూ వున్న సి.సి. కెమెరాలను ధ్వంసం చేయడం విశేషం. బంజారాహిల్స్‌ పోలీసులు లక్ష్మితోపాటు మిగతా ఇద్దరు కూతుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu