చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో రామకుప్పం మండలంలోని వ్యవసాయ బావిలో దూకి తల్లీకూతుళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. రామకుప్పం మండలం కొంగన్నపల్లికి చెందిన సరస్వతి, రాములకు 16 యేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి మధుప్రియ(14) కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య గత కొన్నిసంవత్సరాలుగా తరచూ గొడవలు జరుగుతుండేదని స్థానికులు చెబుతున్నారు.
శనివారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య గొడవ తీవ్రం కావడంతో సరస్వతి తన కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. కొంగన్నపల్లిలోని వ్యవసాయ బావిలోకి కుమార్తెను సరస్వతితోసి ఆ తర్వాత ఆమె కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. గొర్రెలు మేపుకొనే వారు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు.