Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎవరింటి చెత్తను వారి ఇళ్ళలో పడేసిన మోహన్ బాబు.. స్వచ్ఛ భారత్‌ కోసం..

ఎవరింటి చెత్తను వారి ఇళ్ళలో పడేసిన మోహన్ బాబు.. స్వచ్ఛ భారత్‌ కోసం..
, బుధవారం, 19 నవంబరు 2014 (20:50 IST)
టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు ఏ పని చేసినా.. ఎలాంటి డైలాగ్ మాట్లాడినా అది విలక్షణంగానే ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్చచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రంలో ఈ డైలాగ్ కింగ్ కూడా పాలుపంచుకుంటున్నారు. 
 
అయితే, మోహన్ బాబు చేసే పనులు నటనలోనే కాదు నిజ జీవితంలోనూ విలక్షణంగా ఉంటాయి. ఈ కారణంగా కొన్నిసార్లు ఆయన చర్యలు, మాటలు వివాదాస్పదమవుతుంటాయి. అయినా, ఆయన తాను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ముందుకు సాగిపోతుంటారు. 
 
తాజాగా, 'స్వచ్ఛ భారత్' లో పాల్గొన్న మోహన్ బాబు తనదైన శైలిలో వెళ్తున్నారు. చిత్తూరు జిల్లా రంగంపేటలో, ఎవరింటి ఎదురుగా ఉన్న చెత్తను వారింట్లోనే పడేసి, వారికి బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. పారిశుద్ధ్యం పట్ల ప్రజల్లో చైతన్యం రావాలంటే ఇలా చేయడమే కరెక్టు అన్న కోణంలో ఆయన చర్య ఉంది. పైగా ఆయన తన చర్యను సమర్థించుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu