Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
, గురువారం, 5 మార్చి 2015 (16:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలిలోని కొన్ని స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 27న పోలింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఐదు స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
మార్చి 28 తేది నాటికి ఎమ్మెల్యేలు ఎన్నుకున్న నియోకవర్గాలలోని ఎమ్మెల్సీలు పద్మారాజు రుద్రమరాజు, బసవపున్నయ్య, నన్నపనేని రాజకుమారి, తిప్పేస్వామిలు రిటైర్ అవుతారు. వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు మార్చి 10 నుంచి 17 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
మార్చి 27న పోలింగు జరుగుతుంది. ఇందుకోసం రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ స్థానాల కోసం ఇఫ్పటి అన్ని పార్టీలలోనూ ఆశావాహులు పెరుగుతున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu