Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిజాలు దాచిపెట్టి మాట్లాడటం కేసీఆర్ నైజం : యనమల ధ్వజం

నిజాలు దాచిపెట్టి మాట్లాడటం కేసీఆర్ నైజం : యనమల ధ్వజం
, మంగళవారం, 11 నవంబరు 2014 (15:25 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు పెరిగాయని అనడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హితవు పలికారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘సమస్య వచ్చినప్పుడు రెండు ప్రభుత్వాలు కూర్చుని పరిష్కరించుకోవాలని నిబంధన చట్టంలో ఉందనే విషయాన్ని కేసీఆర్ మరచిపోయారన్నారు. 
 
అందుకే శాసనసభను వేదికగా చేసుకుని ఏపీ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వాస్తవాలు దాచి ప్రజలు, శాననసభను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల వంటి కొన్ని ప్రాజెక్టుల నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వాటా ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ కంటే ఎక్కువ వాటాను తెలంగాణ వాడుకుంటోంది. కొన్ని ఏపీ ప్రాజెక్టుల నుంచి అధిక వాటాను వాడుకుంటూనే ఏపీ మీద అభాండాలు వేస్తే ఎలా? రెండు రాష్ట్రాలకూ మంచి జరగాలనే తెలుగుదేశం పార్టీ కోరుకుంటోందని యనమల చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu