Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కల్యాణ్‌తో జగన్‌కు పోలికేమిటి?: ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

పవన్ కల్యాణ్‌తో జగన్‌కు పోలికేమిటి?: ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
, గురువారం, 27 ఆగస్టు 2015 (11:12 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వైకాపా చీఫ్ జగన్‌కు పోలికేమిటని పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. రైతుల మీద పవన్ కల్యాణ్‌కు ఉన్నది నిజమైన ప్రేమ అని, జగన్‌ది కుట్రపూరిత రాజకీయమన్నారు.

జగన్‌కు సీఎం కుర్చీపై ప్రేమే తప్ప, రైతులపై ఏ మాత్రం ప్రేమలేదని మంత్రి పల్లె ఫైర్ అయ్యారు. పవన్‌తో జగన్ ను పోల్చకండని మీడియా ప్రతినిధులను కూడా పల్లె కోరారు. మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, జగన్‌లకు ఉన్నది కపట ప్రేమేనని చెప్పారు. 
 
మరోవైపు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డంగా దోపిడీ చేసిన జగనా, చంద్రబాబు గురించి మాట్లాడేది? అంటూ మండిపడ్డారు. 'లక్ష కోట్ల' కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లే జగన్‌కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదని ఫైర్ అయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu