విశాఖలో ఆకతాయుల కీచకపర్వం... వివాహిత లావణ్యను అలా చంపేశారు...(ఫోటోలు)
విశాఖ: విశాఖపట్నంలో ఆకతాయిల కీచకపర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. అనకాపల్లిలో బైకు మీద వెళతున్న వివాహితను ఏడిపిస్తూ, కారుతో ఢీకొట్టి కొందరు పోకిరీలు పరారయ్యినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వివాహిత లావణ్య ఆసుపత్రిలో చికిత్స పొంద
విశాఖ: విశాఖపట్నంలో ఆకతాయిల కీచకపర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. అనకాపల్లిలో బైకు మీద వెళతున్న వివాహితను ఏడిపిస్తూ, కారుతో ఢీకొట్టి కొందరు పోకిరీలు పరారయ్యినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వివాహిత లావణ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో వివాహిత లావణ్య భర్తకు, మరదలకు గాయాలయ్యాయి.
ఆకతాయుల వేధింపుల కారణంగానే లావణ్య మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. బైకు పైన లావణ్య, ఆమె చెల్లెలు, భర్త ప్రయాణిస్తుండగా కొందరు పోకిరీలు వారిని కారులో వెంబడించినట్లు తెలుస్తోంది. ఏవేవో డైలాగులు కొడుతూ వారి వెంటబడ్డారు. కారుతో బైకును వెనుక నుంచి ఢీకొట్టడంతో బైకు అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో లావణ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె సోదరి, భర్త కూడా గాయాలపాలయ్యారు.