ఆమెతో సహజీవనం చేశాడు.. ఆపై కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు..
తండ్రిలాంటి వ్యక్తి నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. తన ఇద్దరు కుమార్తెలపై నీచమైన కార్యానికి పాల్పడ్డాడు. ఇద్దరు పెంపుడు కుమార్తెలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలికల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస
తండ్రిలాంటి వ్యక్తి నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. తన ఇద్దరు కుమార్తెలపై నీచమైన కార్యానికి పాల్పడ్డాడు. ఇద్దరు పెంపుడు కుమార్తెలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలికల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట ఎస్వీనగర్కు చెందిన లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
కొన్నేళ్ల క్రితమే భర్త మరణించాడు. దీంతో ఒంటరిగా జీవిస్తున్న క్రమంలో వంశీ అనే వ్యక్తి పరిచయం పెంచుకుని సహజీవనం చేసేవాడు. అప్పటికే మొదటి భర్తతో లక్ష్మికి ఇద్దరు బాలికలున్నారు. వంశీ నెల క్రితం తల్లి ఇంట్లో లేని సమయంలో ఇద్దరు బాలికల్లో ఒక బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఆపై మరో బాలికను కూడా బెదిరించి లొంగదీసుకున్నాడు. ఈ విషయాన్ని తల్లి ఎలాగో తెలుసుకుంది. బాలికలతో వచ్చి ఎంఆర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు వంశీ కోసం గాలింపు చేపట్టారు.