Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోమవారానికి స్వగ్రామం చేరనున్న మస్తాన్ బాబు బాడీ

సోమవారానికి స్వగ్రామం చేరనున్న మస్తాన్ బాబు బాడీ
, శనివారం, 18 ఏప్రియల్ 2015 (20:41 IST)
పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం సోమవారానికి నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామానికి చేరుకోనున్నది. అర్జెంటీనాలోని పర్వతాలలో మరణించిన మస్తాన్ బాబు మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో మల్లిబాబు మృతదేహాన్ని తరలిస్తున్నామని ఏపి సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 
 
ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం విమానం చెన్నై చేరుకుంటుందన్నారు. చెన్నై నుంచి రోడ్డు మార్గం ద్వారా మస్తాన్ బాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఈ విషయాన్ని దృవీకరించారు. గత మార్చి 24న పర్వతారోహణ చేస్తూ చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద  ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్న మల్లి మస్తాన్ బాబు.. శవమై తేలిన విషయం తెలిసిందే. 
 

Share this Story:

Follow Webdunia telugu