Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృపామణి ఆత్మహత్య కేసు : ఎట్టకేలకు ప్రధాన నిందితుడి అరెస్టు

కృపామణి ఆత్మహత్య కేసు : ఎట్టకేలకు ప్రధాన నిందితుడి అరెస్టు
, గురువారం, 26 నవంబరు 2015 (13:17 IST)
కృపామణి ఆత్మహత్య కేసులో గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి జారుకున్న ప్రధాన నిందితుడు గుడాల సాయ్ శ్రీనివాస్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టుచేశారు. కృపామణిపై వేధింపులకు ప్రధాన కారణంగా ఉన్న శ్రీనివాస్ మాత్రం పోలీసులకు చిక్కలేదు. అతడు విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీచేశారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాను వదిలి హైదరాబాదులో తలదాచుకున్న శ్రీనివాస్ ఆచూకీని కనిపెట్టిన పోలీసులు బుధవారం రాత్రి అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం రాత్రికి రాత్రే అతడిని పశ్చిమగోదావరి జిల్లాకు తరలించారు. 
 
కాగా, కృపామణి ఆత్మహత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెల్సిందే. సాక్షాత్ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ కేసుపై దృష్టి సారించిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆమె తల్లిదండ్రులు, సోదరుడిని అరెస్ట్ చేశారు. ఇపుడు గుడాల సాయి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu