Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభకార్యానికి వస్తే.. దొంగనే అనుమానంతో చంపేశారు!

శుభకార్యానికి వస్తే.. దొంగనే అనుమానంతో చంపేశారు!
, మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (10:19 IST)
శుభకార్యానికి వస్తే దొంగనే అనుమానంతో కొట్టి చంపేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం కొత్తూరులో దారుణం జరిగింది. కొత్తూరులో ఓ శుభకార్యానికి వచ్చిన కొండారెడ్డి అనే వ్యక్తిని ఊరివాళ్లు దొంగ అన్న అనుమానంతో చావచితగ్గొట్టారు. ఈ ఘటన పెబ్బేరు మండలంలో సంచలనం కలిగించింది. అంతే కాదు, మృతదేహాన్ని అక్కడే ఉన్న కాలువలో పడేసి చేతులు దులుపుకుపోయారు. 
 
కాలువ వైపు వెళ్లిన కొందరు మృతదేహం పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమాయకుడిని కొట్టి చంపారని కొండారెడ్డి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తామడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వనందునే, దొంగగా భావించాల్సి వచ్చిందని ఊరివాళ్లు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu