Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ర్యాగింగ్ భూతం: విజయవాడలో లయోలా విద్యార్థి ఆత్మహత్య!

ర్యాగింగ్ భూతం: విజయవాడలో లయోలా విద్యార్థి ఆత్మహత్య!
, శుక్రవారం, 27 మే 2016 (12:22 IST)
ర్యాగింగ్ భూతం కారణంగా అనేక మంది విద్యార్థులు ప్రాణాలో కోల్పోగా, తాజాగా విజయవాడలోని లయోలా కాలేజీలో ర్యాంగింగ్‌కు మరో విద్యార్థి బలైయ్యాడు. యూనివర్శిటీల్లో, కళాశాలల్లో ర్యాంగింగ్‌కు చెక్ పెడతామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. వైజాగ్‌లో మళ్లీ ర్యాంగింగ్‌‌కు విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. ఇంటర్ చదువుతున్న కమల్ జైన్ అనే విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధించడంతో, మనస్తాపంతో గత రాత్రి హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. సీనియర్లు నిత్యమూ కమల్‌ను ఏడిపించేవారని.. సెల్ ఫోన్ లాక్కోవడం వంటి వేధింపులతోనే అతడు మరణించినట్లు కమల్ జైన్ స్నేహితులు తెలిపారు. ఇంత జరిగినా తమ కాలేజీలో ర్యాంగింగ్ జరగట్లేదని లయోలా యాజమాన్యం చెప్తుండటం గమనార్హం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెచ్‌సీయూలో రాత్రికి రాత్రే శివలింగం, నంది, నాగదేవత ఎలా వచ్చాయ్!?