టెడ్డీబేర్లతో బర్గర్లు తింటూ ఆడుకోవాల్సిన నారా లోకేష్ ఐపాడ్ చేపట్టుకుని రాజకీయాలపై ట్విట్ చేయడం ఆశ్చర్యంగా ఉందనీ, అతను ట్విట్టర్ బాబు మాత్రమే కాదని, బర్గర్ బాబులా, టెడ్డీబేర్గా మారారని వైసీపీ ఎమ్మెల్యే కమలాకర్ ఆరోపించారు. ఆయన రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డికి ఇంకా జ్ఞానోదయం కాలేదని, ఒళ్లు ద్గగర పెట్టుకుని మాట్లాడు అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. టీడీపీ దొంగల ముఠా జైలుకెళ్తేనే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉంటుందని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఆట మొదలు కాలేదు... టీడీపీ ఆట ముగిసింది అని, తెలంగాణతో పాటు ఏపీలోనూ టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు.